చండీఘడ్: హర్యానా ప్రభుత్వం ఇవాళ 1.55 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆరోగ్యం, వ్యవసాయం, మౌళిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థికశాఖ తన వద్దే ఉంచుకున్న సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఇవాళ అసెంబ్లీలో తన రెండవ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గత ఏడాది కన్నా ఈసారి 13 శాతం అధిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 9 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత విద్యను అందించనున్నట్లు బడ్జెట్లో తెలిపారు. హర్యానా రాష్ట్రానికి చెందిన యువతకు సుమారు లక్ష మందికి ప్రైవేటు ఉద్యోగాలు కల్పించనున్నట్లు కూడా బడ్జెట్లో వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి కోసం నిరంతరం రైతులకు సహాయం అందించనున్నట్లు సీఎం ఖట్టర్ చెప్పారు.