శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని షోపియాన్ ద్రాస్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ద్రాస్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఈ ఎన్కౌంటర్లో నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్కు చెందిన ముగ్గురు స్థానిక ఉగ్రవాదులు హతమయ్యారని ఏడీజీపీ విజయ్కుమార్ తెలిపారు.
ఉగ్రవాదులు హసన్ బిన్ యాకూబ్, జంషెడ్ హతమయ్యారు. ఈ నెల 2న పుల్వామాలోని పింగలానాలో ఎస్పీఓ జావేద్ దార్, సెప్టెంబర్ 24న పుల్వామాలో పశ్చిమ బెంగాల్కు చెందిన కూలీని హత్య చేసిన వీరిద్దరు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ములులో జరిగిన ఎన్కౌంటర్లో లష్కర్కు చెందిన స్థానిక ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్నది.