నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా బీర్కుర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. నీటిలో మునిగిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులు బిక్చుంద మండలం సెట్లూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. మంజీర పరీవాహక ప్రాంతంలోని చౌడమ్మ ఆలయానికి వెళ్లేందుకు నది దాటుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది నెలల కిందట మంజీరా నదిలో ఇసుక తవ్వకాలతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. ఈ క్రమంలో కాలినడకన నది దాటుతుండగా.. గుంతల్లో పడి మునిగిపోయారు. స్థానికులు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో తల్లీ పిల్లలు ఉన్నారు. మరొకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.