ముషీరాబాద్, సెప్టెంబర్ 11: వీఎస్టీ-లోయర్ ట్యాంక్బండ్ మార్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన స్టీలు వంతెన నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో ట్రాఫిక్ ఇక్కట్లను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏడాది క్రితం రూ. 356 కోట్ల వ్యయంతో స్టీలు వంతెన నిర్మాణ పను లు మొదలు పెట్టింది. తొలుత స్థల సేకరణలో కొంత జాప్యం జరిగినప్పటికీ ఇటీవల ైప్లెఓవర్ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. స్టీలు వంతెన ప్రారంభమయ్యే నాగమయ్యకుంట నుంచి ఇందిరాపార్కు వరకు పిల్లర్ల నిర్మా ణం దాదాపు పూర్తికావచ్చింది.
నాగమయ్యకుంట నుంచి లోయర్ ట్యాంక్బండ్ వరకు 2.8 కిలోమీటర్ల మేర స్టీలు వంతెన నిర్మిస్తున్నారు. వీఎస్టీ సమీపంలోని నాగమయ్యకుంట వద్ద మొదలవుతున్న వంతెన ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్నగర్, ఇందిరాపార్కు సిగ్నల్ మీదు ట్యాంక్బండ్ కట్టమైసమ్మ దేవాలయం వద్ద పూర్తవుతుంది. ఇందుకు సంబంధించిన పన్నుల్లో భాగంగా వీఎస్టీ-ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇందిరాపార్కు సిగ్నల్ వరకు పిల్లర్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లో మెట్రో వంతెనకు ఇరువైపులా పిల్లర్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది.
వ్యయం రూ.356 కోట్లు..
స్టీలు వంతెన నిర్మాణ వ్యయం రూ.356 కోట్లు. 81 పిల్లర్లతో 2.8 కిలోమీటర్ల పొడవునా వంతెన నిర్మిస్తున్నా రు. నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్, 16 మీటర్ల విడ్త్తో బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. సాధారణ బ్రిడ్జి నిర్మాణం చేపడితే ఆలస్యం జరిగిన, ఐదు సిగ్నల్స్ వద్ద వాహనదారులు ఇక్కట్లు పడతారనే ఉద్దేశంతో ప్రభుత్వం వేగంగా పనులు చేపట్టడం కోసం స్టీలు వంతెన నిర్మాణ పనులు మొదలు పెట్టింది. ప్రస్తుతం 70 వరకు పిల్లర్ల నిర్మాణం పూర్తయింది.
తొలగనున్న ట్రాఫిక్ కష్టాలు..
ట్రాఫిక్ (సిగ్నల్) అడ్డంకులు లేకుండా ప్రయాణం సాగేలా భారీ స్టీలు వంతెన నిర్మాణం జరుగుతుండటం తో త్వరలో ముషీరాబాద్ నియోజకవర్గంలో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. హిందీ మహావిద్యాలయం నుంచి ట్యాంక్బండ్ వరకు ఐదు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్నుంచి వాహనదారులకు విముక్తి కల్పించడంతోపాటు సాఫీగా ప్రయాణం సాగేలా వంతెన నిర్మాణం సాగుతుంది. స్టీలు వంతెన నిర్మించి ఎక్కడా ట్రాఫిక్ జా మ్కు తావులేకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిష్టాత్మకంగా వంతెన పనులు చేపడుతున్నారు. అంతేగాక అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేపట్టడానికి రోడ్డు విస్తరణ పనులు సైతం పూర్తి చేశారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి.
ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
స్టీలు వంతెన నిర్మాణంతో ట్రా ఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి. స్టీలు వంతెన నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు సహకరించాలి.
– ముఠా గోపాల్, ఎమ్మెల్యే