అమరావతి : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కొమరోలు మండలం
తాటిచెర్లమోటులో ప్రమాదం వద్ద ట్రాలీ ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు
అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆసుపత్రికి
తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు
చేపట్టారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించి ఇంకా
పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.