హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా డిండ్గి వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్-బీదర్ రహదారిపై కారు అదుపు తప్పి బోల్తా కొడుతూ వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న దంపతులతో పాటు ఎనిమిది నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. దంపతులను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన బాలరాజు (28), శ్రావణి (22), అమ్ములు (8 నెలలు)గా గుర్తించారు.
అలాగే ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి సైతం మృతి చెందాడు. సదరు వ్యక్తిని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూరు వాసి ఫరీద్ (25)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.