అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి రహదారిపై కారు, ఆటో ఢీకొన్న సంఘటనలో నలుగురు చనిపోయారు. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలు కాగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు మొగుళ్లపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాదానికి గత కారణాలను బాధితుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.