హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం నుంచి నాలుగు రోజులపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. దసరా నేపథ్యంలో వ్యాక్సినేషన్కు ఈ నెల 15, 16 తేదీలను సెలవుగా ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. గురువారం కూడా సెలవు ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ సిబ్బంది.. ముఖ్యమంత్రి కేసీఆర్కు విన్నవించారు. సీఎం ఆదేశం మేరకు సెలవు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. సాధారణంగా ఆదివారాలు వ్యాక్సినేషన్ ఉండదు. దీంతో వరుసగా నాలుగు రోజులపాటు గురువారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలో వ్యాక్సినేషన్కు విరామం ఉంటుందని అధికారులు తెలిపారు. తిరిగి 18వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ యథావిధిగా ప్రారంభమవుతుందని చెప్పారు.