అమరావతి : ఏపీలోని విశాఖపట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. వడ్డాది మాడుగుల పెద్దేరులో నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. పెద్దేరు రేవు ఊభిలో గిరిజన చిన్నారులు చిక్కుకుపోయారు. బట్టలు ఉతికేందుకు కుటుంబీకులతో కలిసి చిన్నారులు రేవులోకి దిగారు. ప్రమాదవశాత్తు చిన్నారులు మహేందర్ (7), షర్మిల (7), ఝాన్సీ (10), జాహ్నవి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.