న్యూఢిల్లీ, అక్టోబర్ 17: రూపాయి పతనంపై కొత్త భాష్యం చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఘాటు రిైప్లె ఇచ్చారు. ‘మేం ఓడిపోలే.. వాళ్లే గెలిచారు’ అన్న చందంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ‘రూపాయి పడిపోలే.. డాలరే బలపడ్డది అని ఆర్థిక మంత్రి అన్నారు.
కరెక్టే! ఒక అభ్యర్థి గానీ, ఒక పార్టీ గానీ ఎన్నికల్లో ఓడిపోతే కచ్చితంగా.. ఎన్నికల్లో మేం ఓడిపోలే, ఆ పార్టీ గెలిచింది అని చెప్పాలి’ అని తనదైన శైలిలో చురక అంటించారు. కాగా, శనివారం వాషింగ్టన్లో మాట్లాడిన నిర్మలా సీతారామన్.. ‘నాకు తెలిసి రూపాయి పడిపోయిందని అనకూడదు, అమెరికా డాలరే బలపడిందని చెప్పాలి. చెప్పాలంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత రూపాయి పరిస్థితే మెరుగ్గా ఉన్నది’ అని తెలిపారు.