పాట్నా : పద్మశ్రీ, డీఆర్డీఓ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ మానస్ బిహారీ వర్మ (78) గుండెపోటుతో సోమవారం రాత్రి దర్భాంగాలో మరణించారు. వర్మ కుటుంబ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, అతను రాత్రి 11.45 గంటలకు దర్భాంగా పట్టణంలోని లాహేరియసారైలోని కేఎమ్ ట్యాంక్ ప్రాంతంలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సన్నిహితుడు, మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) తేజస్ను తయారు చేయడంలో వర్మ కీలక పాత్ర పోషించారు. తేజస్ ప్రారంభ ఆపరేషన్ క్లియరెన్స్తో పాటు ఆయుధాలు, మల్టీ-మోడ్ రాడార్ (ఎంఎంఆర్) పనిలో వర్మ కీలకంగా పనిచేశారు.
వర్మ సేవలకు గాను 2018 లో భారత ప్రభుత్వం వర్మను పద్మశ్రీ తో సత్కరించింది. బిహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వర్మ.. తన 35 సంవత్సరాల సేవలో దేశంలోని అన్ని ఏరోనాటికల్ సంస్థలతో కలిసి పనిచేశారు. 2002 నుంచి 2005 వరకు బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ప్రోగ్రామ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ సమయంలో ఏపీజే అబ్దుల్ కలాంతో కలిసి పనిచేసే అవకాశం వర్మకు లభించింది.
డిప్యూటీ గవర్నర్లకు విభాగాలు కేటాయించిన ఆర్బీఐ
పాకిస్తాన్లో బస్సు ప్రమాదం: 15 మంది మృతి
‘రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయిస్తారు’: నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై ఈసీ
సంకీర్ణం ఏర్పాటులో నెతన్యాహు విఫలం.. ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధం
మయన్మార్లో పార్సిల్ బాంబు పేలుడు, ఎంపీ సహా ఐదుగురు మృతి
ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి 5 జీ సేవలు..?
పడిపోయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
భారతదేశం సేవలు అజరామరం : హార్వర్డ్ ప్రొఫెసర్ జెస్సీ బంప్
ఉత్తరాఖండ్లో భారీ వర్షం.. బురదలో కూరుకుపోయిన ఇండ్లు
తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..