న్యూఢిల్లీ : మాజీ ఎంపీ విజయ్ గోయల్ చేతుల్లోంచి ఓ గుర్తు తెలియని అగంతకుడు ఫోన్ లాక్కెళ్లాడు. ఈ ఘటన ఢిల్లీలోని రెడ్ఫోర్ట్ వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. విజయ్ గోయల్ దర్యాగంజ్ నుంచి రెడ్ ఫోర్ట్కు వెళ్తున్నారు. రాత్రి 7:45 గంటల సమయంలో జామా మసీదు మెట్రో స్టేషన్ వద్దకు చేరుకోగానే.. విజయ్ చేతుల్లో ఉన్న ఫోన్ను గుర్తు తెలియని అగంతకుడు లాక్కెళ్లాడు. దీంతో మాజీ ఎంపీ ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న కొత్వాలి పోలీసులు.. అగంతకుడి ఆచూకీ కోసం తనిఖీలు చేపట్టారు.