కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో అరెస్టైన ఉమా శంకర్ రెడ్డిని అధికారులు మూడో రోజు విచారిస్తున్నారు. వివేకా హత్యకేసుతో సంబంధం ఉన్నమరో ఇద్దరు నిందితులు అధికారుల ముందు హాజరయ్యారు. కాగా హత్యకు ఉపయోగించిన ఆయుధాలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.
విచారణలో భాగంగా సీబీఐ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. సోమవారం ఉమా శంకర్రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా విచారణ కోసం సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామాని కి చెందిన సోమశేఖర రెడ్డి, పులివెందులకు చెందిన వెంకటనాథ్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు.