న్యూఢిల్లీ: భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కేకే అగర్వాల్ కరోనాపై సుదీర్ఘ పోరాటం అనంతరం కన్నుమూశారు. ఆన వయసు 62 సంవత్సరాలు. కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన అగర్వాల్ కొన్నాల్లుగా వెంటిలేటర్పై ఉన్నారు. సోమవారం రాత్రి 11.30 గంటలకు అగర్వాల్ అంతిమశ్వాస విడిచినట్టు ఆయన ట్విట్టర్ హేండిల్లో ఉంచిన ఒక ప్రకటన వెల్లడించింది. కరోనా కల్లోలంలో కూడా ఆయన జనాలను చైతన్యపరిచేందుకు అనేక వీడియోలు, విద్యా కార్యక్రమాలు రూపొందించి విడుదల చేశారు.