హైదరాబాద్ : జాతీయ పార్టీ ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, వీసీకే పార్టీ ఎంపీ తిరుమాళవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్కు శాలువా కప్పి సత్కరించారు. పార్టీ సర్వసభ్య సమావేశానికి కుమారస్వామి, తిరుమాళవన్ ఇద్దరూ హాజరయ్యారు. వీరందరి సమక్షంలో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేశారు.
టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా కేసీఆర్ ప్రకటిస్తూ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని పార్టీ నేతలంతా ఆమోదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుంది. సుమారు 8 రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా ఇవాళ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.