నాగర్కర్నూల్ : ఇప్ప పువ్వు సేకరణకు వెళ్లిన గిరిజనులపై అటవీశాఖ అధికారులు దాడి చేశారు. ఈ ఘటన అమ్రాబాద్ పరిధిలోని టైగర్ రిజర్వ్ ఫారెస్టులో రాత్రి 2 గంటల సమయంలో చోటు చేసుకుంది.
అమ్రాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 20 మందికి పైగా ఇప్ప పువ్వు కోసం రాత్రి అడవిలోకి వెళ్లారు. రాత్రి 2 గంటల సమయంలో వీరు నిద్రిస్తుండగా.. ఒక్కసారిగా సుమారు 20 మంది అటవీశాఖ అధికారులు వారిపై కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన బాధితులు పరారీ అయ్యారు. కొంత మందిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని బేస్ క్యాంపుకు తరలించారు. గాయపడిన వారిలో పలువురు మహిళలు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి