యాదాద్రి భువనగిరి : జిల్లాలోని చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో దారుణం చోటు చేసుకుంది.
ఆరెగూడెం గ్రామంలో వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పిశాటి మారా రెడ్డి (65), మల్లమ్మ(60) భార్య భర్తలు. మల్లమ్మ ఆరోగ్య పరిస్థితి గత కొంత కాలంగా బాగా లేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.
ఇది గమనించిన భర్త వెళ్లేసరికి పూర్తిగా కాలిపోయింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక మారా రెడ్డి కూడ ఓ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల కుమారుడు బాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.