హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలిసారిగా అంబులెన్స్లో నైట్రిక్ ఆక్సైడ్తో కూడిన హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ను అందుబాటులోకి తెచ్చామని హైదరాబాద్ రెయిన్బో చిల్డ్రన్స్ దవాఖాన వైద్యనిపుణుడు డాక్టర్ నలినీకాంత్ పాణిగ్రహి తెలిపారు. ఆక్సిజన్ తీసుకోలేని క్లిష్టమైన కేసులను అత్యవసర చికిత్స కోసం ఒక దవాఖాన నుంచి మరో దవాఖానకు వెంటిలేషన్పై తరలించడం వల్ల శిశువు ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంటుందని తెలిపారు.
ఇటువంటి క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు ఈ వెంటిలేషన్ సౌకర్యాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. గోవా, మహారాష్ట్ర, తదితర దూర ప్రాంతాల నుంచి ఇప్పటికే 9మంది నవజాత శిశువులను నైట్రిక్ ఆక్సైడ్తో కూడిన హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ ద్వారా సురక్షితంగా రెయిన్బోకు తరలించి, మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు వివరించారు.