ముంబై: క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లిన ఆర్యన్ఖాన్ రేపు లేదా ఎల్లుండి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నదని భారత మాజీ అటార్ని జనరల్ ముకుల్ రోహత్గీ చెప్పారు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తరఫున ముకుల్ రోహత్గీనే వాదనలు వినిపించారు. బాంబే హైకోర్టు ఆర్యన్ఖాన్కు బెయిల్ మంజూరు చేసిన అనంతరం కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడిన ముకుల్ రోహత్గీ.. మూడు రోజుల వాదనల అనంతరం కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసిందన్నారు.
ఆర్యన్ఖాన్తోపాటు ఆర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. బెయిల్కు సంబంధించి కోర్టు శుక్రవారం సంపూర్ణ ఆదేశాలను రేపు ఇస్తుందని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు రేపుగానీ లేదా ఎల్లుండిగానీ ఆ ముగ్గురిని విడుదల చేసే అవకాశం ఉన్నదన్నారు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే వాళ్లు జైలు నుంచి బయటికి వస్తారని చెప్పారు. కేసు గెలువడం, ఓడటం అనేది నాకు సాధారణమేనన్నారు. ఆర్యన్ఖాన్కు బెయిల్ దొరకడం సంతోషంగా ఉందని చెప్పారు.