కాబూల్, అక్టోబర్ 25: అఫ్గానిస్థాన్ తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోనున్నదని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. దేశంలో సగానికి పైగా జనాభా.. దాదాపు 2.28 కోట్ల మందికి ఆహార భద్రత కొరవడుతుందని, 32 లక్షల మంది ఐదేండ్లలోపు పిల్లలకు పోషకాహారం లోపిస్తుందని ఐరాస అనుబంధ సంస్థ ‘వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్’ (డబ్యూఎఫ్పీ) పేర్కొంది. అత్యవసర చర్యలు చేపట్టకపోతే ఈ శీతాకాలంలోనే అఫ్గానిస్థాన్ కరువు కోరల్లో చిక్కుకుంటుందని, ఆ విపత్తుకు ‘కౌంట్డౌన్’ మొదలైందని ఆందోళన వ్యక్తం చేసింది.