హైదరాబాద్ : జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. ఈ జంట జలాశయాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది.
ఈ నేపథ్యంలో ఉస్మాన్సాగర్కి 1700 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు 4 అడుగుల మేర ఎత్తి దిగువకు 1,768 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్కు ఎగువ నుంచి 1,300 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో మూడు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 1,373 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను జలమండలి అధికారులు ఎప్పటికప్పడు అప్రమత్తం చేస్తున్నారు.