హైదరాబాద్ : హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్సాగర్లోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి గడిచిన కొన్ని రోజులుగా జలాశయాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఉస్మాన్సాగర్కి 900 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు 4 అడుగుల మేర ఎత్తి 1836 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు.
హిమాయత్ సాగర్కు ఎగువ నుంచి 2,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, మూడు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి, 2,060 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు.