హైదరాబాద్ : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి 6,328 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం నీటిమట్టం 822.30 అడుగులుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 42.6064 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎడమ గట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. విద్యుత్ ఉత్పత్తితో 35,315 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.