ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ మరో కొత్త సేల్తో వినియోగదారుల ముందుకొచ్చింది. ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్ కార్నివాల్ పేరుతో సోమవారం ప్రారంభమైన ప్రత్యేక సేల్ ఈనెల 12 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లపై బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది.
ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్ఆర్, రియల్మీ సీ12, పొకో సీ3, రియల్మీ నార్జో 30A వంటి మోడళ్లపై ధరలు తగ్గించారు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.1,250 వరకు తక్షణ డిస్కౌంట్ లభించనుంది. మొబైళ్ల కొనుగోలుపై నో-కాస్ట్ ఈఎంఐ, కంప్లీట్ మొబైల్ ప్రొటెఓన్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి.