న్యూఢిల్లీ : ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఈనెల 23న బిగ్ సేవింగ్స్ డే సేల్ను నిర్వహిస్తోంది. ఈ సేల్లో భాగంగా కస్టమర్లకు స్మార్ట్ఫోన్లు, వేరబుల్స్, ల్యాప్టాప్లు సహా పలు ఉత్పత్తులపై ఆకర్షణీయ డీల్స్, డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. జులై 27 వరకూ ఫ్లిప్కార్ట్ సేల్ ఆఫర్లు లైవ్లో ఉంటాయి. ఒప్పో రెనో 5 ప్రొ, ఐఫోన్ 11, మోటో జీ31పై పలు ఆఫర్ల గురంచి ఫ్లిప్కార్ట్ ఇప్పటికే టీజర్లలో వెల్లడించింది. సేల్ డేట్ దగ్గరపడే కొద్దీ మరిన్ని ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంది.
వివో, ఒప్పో, మొటొరోలా, యాపిల్ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్పై ఫ్లిప్కార్ట్ సేల్లో 80 శాతం వరకూ డిస్కౌంట్లు ఉన్నాయి. ఇక హెడ్పోన్లు, స్పీకర్లపై 70 శాతం వరకూ డిస్కౌంట్ లభించనుండగా రూ 99 నుంచి రూటర్స్, కీబోర్డులు వంటి కంప్యూటర్ యాక్సెసరీస్ లభిస్తాయి. ఇక ట్యాబ్లెట్స్పై సేల్లో 45 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు.
సేల్లో టీవీలు, అప్లయన్సెస్పై ఏకంగా 70 శాతం ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ పేర్కొంది. బ్యాంక్ ఆఫర్లతో కస్టమర్లు అదనంగా డిస్కౌంట్లు పొందే వెసులుబాటు ఉంది. కొన్ని ఉత్పత్తులపై నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇక మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం జులై 23న ప్రైం డే సేల్ను నిర్వహిస్తోంది. జులై 24న అమెజాన్ సేల్ ముగియనుండగా కొన్ని ఆఫర్లను జులై 27 వరకూ కంపెనీ పొడిగించే అవకాశం ఉంది.