న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ జబల్పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఎయిర్ అలయన్స్ విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నది. కిందకు దిగే క్రమంలో విమానం.. రన్వే నుంచి ప్రమాదవశాత్తు పక్కకు జరిగిపోయింది. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అధికారులు తెలిపారు.
ఆ సమయంలో విమానంలో 55 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదని చెప్పారు. ఎయిర్ అలయన్స్కు చెందిన ఏటీఆర్-72 ఢిల్లీ నుంచి ఉదయం 11.30 గంటలకు బయలుదేరింది. మధ్యాహ్నం 1.15 గంటలకు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ల్యాండింగ్ చేస్తున్నండగా ఘటన చోటు చేసుకున్నది. ఘటన అనంతరం ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించినట్లు పేర్కొన్నారు. ప్రమాదం అధికారులు విచారణ జరుపుతున్నారు.