చెన్నై: తమిళనాడులో అధికార పార్టీ ప్రధానకార్యాలయం ముందు బైకర్లు రెచ్చిపోయారు. చెన్నైలోని తెయ్నామ్పేట్లో ఉన్న డీఎంకే ప్రధాన కార్యాలయానికి ఎదురుగా కొందరు యువకులు శుక్రవారం తమ బైకులతో ప్రాణాంతక స్టంట్లు చేశారు. వాటిని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్గా మారడంతో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదుచేసి.. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన బినోస్ని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం అతడికోసం గాలిస్తున్నారు.