ముంబై: క్వారంటైన్ పూర్తి చేసుకున్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గురువారం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) క్యాంప్లో చేరాడు. ఎల్లో జెర్సీలో సహచర ఆటగాడు సురేశ్ రైనాతో కలిసి దిగిన ఫొటోను మూడు సార్లు ఐపీఎల్ చాంపియన్ చెన్నై ట్విటర్లో షేర్ చేసింది.మైదానం బయట, లోపల చాలా ఉత్సాహంగా ఉండే జడేజా రాకతో చెన్నై శిబిరంలో జోష్ వచ్చింది.
గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించిన జడ్డూ సీఎస్కే క్యాంప్లో చేరడానికి ముందే ట్రైనింగ్ను ప్రారంభించాడు. ఈ ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ 9 నుంచి ఆరంభంకానుండగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై తన తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. గత జనవరిలో ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్లో జడేజా బొటనవేలుకు గాయమైంది. దీంతో జడ్డూ ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్కు దూరమయ్యాడు.