అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్య్స కారులు నిరసన తెలిపారు. 20 సంవత్సరాల క్రితం టెర్మినల్ నిర్మాణానికి భూములిచ్చిన మత్స్యకారులకు ప్రభుత్వం పలు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చ లేదని మత్స్యకారులు ఆరోపించారు. 60 గజాలు ఇంటి స్థలం, రూ. లక్ష పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇంతవరకు నెరవేరలేదని నిరసన తెలిపారు.
షిప్లు వచ్చే మార్గంలో 25కి పైగా బోట్లు అడ్డుపెట్టి నిరసనకు యత్నించారు. మత్స్యకారుల ఆందోళనలతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అక్కడ ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.