మెదక్ : పాపన్నపేట మండలం ఎల్లాపూర్ సమీపంలోని మంజీరా నదిలో ఆరుగురు మత్స్యకారులు చిక్కుకున్నారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో సింగూర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేయడంతో ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎల్లాపూర్ – పేరూరు సమీపంలో నది మధ్యలో ఉన్న ఆరుగురు నీటిలో చిక్కుకున్నారు. అయితే వారు చేపల వేటకు వెళ్ళినట్లు తెలిసింది. కాగా సహాయక చర్యల నిమిత్తం స్థానికులు అధికారులకు సమాచారాన్ని అందించారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్ సమీపంలోని మంజీరా నదిలో చేపల వేటకు వెళ్లి చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులు.. #Telanganarains pic.twitter.com/oWfKbgQ0tx
— Namasthe Telangana (@ntdailyonline) September 29, 2022