వెల్గటూర్ : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువుల పునరుద్ధరణ జరిగి, చేపల ఉత్పత్తి పెరిగి రాష్ట్రం ఫిష్ హబ్గా మారిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండలంలోని కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో గురువారం జడ్పీచైర్పర్సన్ వసంత, కలెక్టర్ రవితో కలిసి 6.10 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం 690 చెరువుల్లో కోటీ 46 లక్షల చేప పిల్లలను 2కోట్లు ఖర్చు చేసి ఈ ఏడాది విడుదల చేస్తున్నదని, అందులో భాగంగానే గోదావరి నదిలో 6.10 లక్షల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు.
690 చెరువులతోపాటు 250 కిలోమీటర్ల మేర కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో నిండి ఉండటంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని మత్స్యకారులకు ఉపాధితోపాటు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. గతేడాది రాష్ట్రంలో 2.34 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరుగగా, ఈ ఏడాది అంతకన్న ఎక్కువ ఉత్పత్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చారని కొనియాడారు.
కార్యక్రమంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ సుధారాణి, వైస్ చైర్మన్ హరిచరణ్రావు, ఏఎంసీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, పాక్స్ చైర్మన్లు గూడా రాంరెడ్డి, గోలి రత్నాకర్, సర్పంచ్లు మౌనిక రవితేజ, ఆగండ్ల తిరుపతి, బోడకుంటి రమేశ్, మారం జలంధర్రెడ్డి, ఎంపీటీసీ మూగల రాజేశ్వరీసత్యం, ఆర్బీఎస్ కన్వీనర్ శంకర్రావు, మండల పార్టీ అధ్యక్షుడు రాంచందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సింహాచలం జగన్, నాయకులు పోడేటి సతీశ్, రవి, కొప్పుల సురేశ్, కుమార్, మత్స్యకారుల సొసైటీ అధ్యక్షుడు సతీశ్, గోపి, వెంకటేశ్, రంగు తిరుపతి, గుండా జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.