హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వాణిజ్య విధానాలు భేష్ అని, ఇక్కడ వ్యాపార నిర్వహణ సులభతరంగా ఉన్నదని ఫిస్కర్ సీఈవో హెన్రిక్ ఫిస్కర్ కొనియాడారు. అమెరికాకు చెందిన ఈ విద్యుత్తు ఆధారిత వాహన తయారీ సంస్థ.. భారత్లో తమ ప్రధాన కేంద్రాన్ని హైదరాబాద్లోనే పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ జాతీయ వాణిజ్య వార్తా వెబ్సైట్కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న పాలసీలను ఫిస్కర్ ప్రశంసించారు. తమ హైదరాబాద్ కేంద్రంలో దాదాపు 50 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరి సంఖ్య 500కు పెంచనున్నట్టు చెప్పారు. నగరంలో మరో నూతన ఆఫీస్ స్పేస్ కోసం కూడా చూస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘హైదరాబాద్లో మా సంస్థ ప్రధాన కేంద్రాన్ని పెట్టే ముందు బెంగళూరు వం టి పలు నగరాల్లోని పరిస్థితులనూ గమనించాం. ఎక్కడాలేని విధంగా ఇక్కడ (హైదరాబాద్) ప్రతిభావంతుల్ని గుర్తించాం. మెరుగైన రవాణా వసతులను పరిశీలిం చాం. మా సంస్థ ప్రగతికి అన్నివిధాలా హై దరాబాద్ బాగుంటుందని ఓ నిర్ణయానికి వచ్చాం. ఈ ఏప్రిల్లో ఇక్కడ ఫిస్కర్ ఇం డియా ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేశాం’ అని ఫిస్కర్ తెలియజేశారు.
క్షణాల్లో అనుమతులు
రాష్ట్ర ప్రభుత్వ సహకారం, మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఫిస్క ర్ అన్నారు. ఇదో వ్యాపార ప్రోత్సాహక ప్రభుత్వమని అభినందించారు. ముఖ్యం గా ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్.. అమెరికా పర్యటన సందర్భంగా తమ సం స్థ ప్రధాన కార్యాలయానికి వచ్చినట్టు ఫిస్కర్ గుర్తుచేశారు. నాడు ఆయన చెప్పినట్టే హైదరాబాద్లో తమ కేంద్రానికి కా వాల్సిన అన్ని అనుమతులు శరవేగంగా వచ్చేశాయన్నారు. భారత్లో తమ తొలి కారు వచ్చే జూలైలో వస్తుందన్నారు.