హైదరాబాద్ : నగరంలోని ఆసిఫ్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ని విజయ్నగర్ కాలనీలో ఓ చెత్త కుప్పకు నిప్పు పెట్టగా, ఆ మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. అక్కడే ఉన్న స్తంభానికి మంటలు అంటుకున్నాయి. దీన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.