హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రంలో ఆదివారం భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. కేంద్రంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగిందని అధికారవర్గాలు పేర్కొన్నారు. అయితే, ప్రమాదానికి కారణాలు కారణాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.