అమరావతి : తిరుమలలో అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం శ్రీవారి ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరు దుకాణాలకు మంటలు భారీగా చెలరేగడంతో చుట్టు పక్కల ఉన్న వాటికి అంటుకున్నాయి. ప్రమాదంలో సుమారు 20 దుకాణాలు దగ్ధమయ్యాయి. అందులో ఉన్న సామగ్రి దహనం అవడంతో వ్యాపారులకు భారీగా నష్టం జరిగింది.సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బందికి సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. మంటల్లో ఓ దుకాణదారుడు సజీవ దహనమయ్యాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. శిథిలాలు తొలగిస్తుండగా.. షాప్ నంబర్ 84లో మృతదేహం లభ్యమైంది. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.