న్యూఢిల్లీ : దేశ రాజధానికి చేరువలోని నోయిడాద సెక్టార్ 65లో ఓ కార్డ్బోర్డ్ బాక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న అధికారులు ఘటనా ప్రాంతానికి అగ్నిమాపక యంత్రాలను తరలించి దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
శుక్రవారం ఉదయం ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగినట్టు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని అధికారులు చెప్పారు. మంటలు ఎగిసిపడటంతో రూ లక్షల విలువైన సరుకు దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం ఎవరికీ గాయాలైన వివరాలు వెల్లడి కాలేదు.