నిర్మల్ : జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ వెనుకాల ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
అక్కడి పిచ్చి మొక్కలు, గడ్డికి మొత్తం మంటలు అంటుకోగా, సిబ్బంది అప్రమత్తమై ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, మంటలను ఆర్పేశారు.
విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది డీటీ తెలంగరావు, గిర్ధావర్ నారాయణ అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే వరకు ట్రిపుల్ ఐటీ సిబ్బందితోనే ఉన్నారు.