కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఎల్జీ షోరూంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి షోరూం మొత్తం వ్యాపించడంతో.. ఫ్రిజ్లు, ఎల్ఈడీలు, టీవీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. షార్ట్సర్య్కూట్ తోనే అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విద్యుదాఘాతంతో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం కలిగినట్లు షోరూం నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.