హైదరాబాద్: పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ కింది భాగంలో పిల్లర్లకు ఏర్పాటు చేసిన డెకరేషన్ సామగ్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి. మంటలు రావడతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ క్రమంలో పోలీసులు ట్రాఫిక్ను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.