హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ 504, 55(2), 506 సెక్షన్ల కింద అరవింద్పై కేసు నమోదు చేశారు. నవంబర్ 8న అరవింద్ నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బోయిన్పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్ సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.