చెన్నై : విద్యార్ధినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్పై కన్యాకుమారి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొఫెసర్ వాసుదేవన్ విద్యార్ధినులకు అభ్యంతరకర మెసేజ్లు, వీడియోలు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. వాసుదేవన్పై కాలేజీ అధికారులకు 22 ఏండ్ల విద్యార్ధిని ఫిర్యాదు చేయడంతో ప్రొఫెసర్ నిర్వాకం వెలుగుచూసింది.
ప్రొఫెసర్పై కాలేజ్ అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో విద్యార్ధులు తరగతులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వాసుదేవన్పై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్ధినులను ప్రొఫెసర్ పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేసినా కాలేజ్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని వాపోయారు.
ద్వందార్ధాలతో కూడిన మెసేజ్లు, అశ్లీల వీడియోలను వాసుదేవన్ పంపాడని ఓ విద్యార్ధిని తెలిపింది. ఈ విషయం ఆమె తన సోదరుడికి తెలపడంతో అతడు ప్రొఫెసర్ను నిలదీశాడు. అధికారులు వాసుదేవన్పై ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో విద్యార్ధులు నిరసనలకు దిగారు. ఇక విద్యార్ధినుల ఫిర్యాదు ఆధారంగా వాసుదేవన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలను తోసిపుచ్చిన ప్రొఫెసర్ తనపై దాడి చేశాడని విద్యార్ధిని సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.