న్యూఢిల్లీ: మెగాటోర్నీల్లో ప్రాతినిధ్యం వహించనున్న భారత ఆర్చర్లకు రూ.33.18 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు మిషన్ ఒలింపిక్ సెల్ (ఎమ్వోసీ) ఆమోదం తెలిపింది. టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్స్ (టాప్స్) కింద క్రీడా పరికరాల కొనుగోలు కోసం ఒక్కో ఆర్చర్కు రూ.3.5 లక్షల చొప్పున భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) సహాయం అందించనుంది. మొత్తం 10 మంది ఆర్చర్లు ఆర్థిక సాయం పొందనున్నారు. ఆసియా క్రీడలు, ప్రపంచకప్ల కోసం పార్థ్ సోలంకి, ఆదిత్య చౌదరి, దీప్తి కుమారి, సిమ్రన్జిత్ కౌర్, నీరజ్ చౌహాన్, రిధి, మధు వెద్వాన్, సుధాన్షు బిష్త్, దివ్యాన్ష్ కుమార్, తిష పునియా సన్నద్ధమవుతున్నారు.