అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవార్షిక బడ్జెట్ను శుక్రవారం ఉదయం 10.15 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి , ఉదయం 11 గంటలకు మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అవే సమయాల్లో శాసన మండలిలో బడ్జెట్ను మంత్రి సీదిరి అప్పలరాజు, వ్యవసాయ బడ్జెట్ను మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రవేశపెట్టనున్నారు.
అంతకు ముందు రాష్ట్ర మంత్రి మండలి సమావేశమై రాష్ట్ర వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపిన అనంతరం ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.