సీఎం కేసీఆర్ చొరవతో వేసవిలోనూ జలకళ..
మల్లన్నసాగర్ను హేళన చేసినవారే హర్షిస్తున్నారు
ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
గజ్వేల్ రూరల్, మార్చి 23 : కూడవెళ్లి వాగుకు గోదావరి జలాలతో పునర్జన్మను ప్రసాదించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మసాగర్కు వెళ్లే కాలువ వద్ద గోదావరి జలాలకు పూజలు చేసి వాగులోకి వదిలారు. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు వదలడం ద్వారా గజ్వేల్, జగదేవ్పూర్, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లోని 11 వేల ఎకరాలకు సాగు నీరందుతుందని మంత్రి చెప్పారు. మల్లన్నసాగర్ పనులు ప్రారంభించిన రోజు హేళన చేసిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు.. నేడు పనుల పురోగతిని చూసి అసూయపడుతున్నరని విమర్శించారు. వాగులో ప్రవహిస్తున్న నీటిని చూసిన రైతుల కండ్లలో వెయ్యి వోల్టుల వెలుతురు కనిపిస్తున్నదని చెప్పారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఈఎన్సీ హరిరామ్, ఎస్ఈ వేణు, మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.