కోల్కతా, అక్టోబర్ 3: జాతిపిత మహాత్మాగాంధీని అఖిల భారత హిందూ మహాసభ అసురుడిగా చిత్రీకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్మీడియాలో వైరల్ కావడంలో పోలీసులు కేసు నమోదు చేశారు. దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా నైరుతి కోల్కతాలోని రూబీ క్రాసింగ్ దగ్గర అఖిల భారత హిందూ మహాసభ నిర్వాహకులు మండపాన్ని ఏర్పాటుచేసి దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆదివారం గాంధీ జయంతి నాడే దుర్గామాత విగ్రహంలోని మహిషాసురుడి స్థానంలో మహాత్ముడిని పోలిన బొమ్మను ఉంచడం వివాదాస్పదమైంది. జాతిపితను అమానించడం అంటే భారత పౌరులందరినీ అవమానించడమేనని టీఎంసీ ధ్వజమెత్తింది. కాగా, నిర్వాహకులు దుర్గాపూజ చేయటం ఇదే తొలిసారి. గతం లో పూజలు నిర్వహించిన దాఖలాలు లేవు.
విశ్వగురువు.. గాంధీజీ : కేటీఆర్
మహాత్మాగాంధీ సిద్ధాంతాన్ని కించపరిచేందుకు స్వయం ప్రకటిత విష గురువులు, గాడ్సేపై ప్రేమ గల వారి శిష్యులు ఎంత ప్రయత్నించినా.. లక్షల ఏైండ్లెనా విజయం సాధించలేరని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. విశ్వగురువుగా ప్రపంచం గుర్తించిన ఏకైక భారతీయుడు మహాత్మాగాంధీ అని గుర్తుచేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోల్కతాలో హిందూ మహాసభ ఏర్పాటుచేసిన మండపంలో మహాత్మాగాంధీని దుర్గాదేవి చంపినట్టుగా చిత్రీకరించారని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు.