అమరావతి : అల్లూరి జిల్లాలోని పాడేరు ఘాట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది గిరిజనులకు గాయాలయ్యాయి. 12వ మైలురాయి సమీపంలో బోలెరో వాహనం అదుపుతప్పి లోయలో బోల్తాపడింది. వాహనంలో ఉన్న 15 మందికి గాయాలు కాగా వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. విశాఖపట్నం ఆర్.కె బీచ్ వద్ద జరుగనున్న బహుజన సమాజ్ పార్టీ ఉత్తరాంధ్ర బహుజన చైతన్య సభకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.