లక్నో : ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లా బిల్గ్రామ్ పట్టణంలో నడిరోడ్డుపై ఓ రెండు ఎద్దులు బీభత్సం సృష్టించాయి. ఆ రెండు ఎద్దులు భీకరంగా పొట్లాడుకున్నాయి. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. ఆ రెండు ఎద్దులను విడిపించేందుకు స్థానికులు శతవిధాలా ప్రయత్నం చేశారు. కర్రలతో కొట్టారు. చివరకు ఆ రెండు ఎద్దులు విడిపోయాయి. ఈ తతంగాన్ని అంతా స్థానికులు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇక ఎద్దుల ఫైటింగ్ను చూసి కొందరు పరుగులు పెట్టారు. ఈ ఫైటింగ్తో కొన్ని వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.