హైదరాబాద్: ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎస్ సోమేశ్కుమార్ అన్నారు. పదోన్నతులు కల్పించినందుకు సీఎస్ సోమేశ్ కుమార్కు సచివాలయ ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. గురువారం సచివాలయంలోని ఆయన కార్యాలయంలో సీఎస్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగులు సమర్థంగా, పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకనుగుణంగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. ఉద్యోగులకు సాధారణ పరిపాలనా శాఖ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎస్ సూచించారు.