అహ్మదాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అబార్షన్ కిట్లను విక్రయిస్తున్న ముఠాను గుజరాత్ ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీసీఏ) అరెస్టు చేసింది. ఈ సందర్భంగా రూ.1.50 కోట్ల విలువైన 24,363 అబార్షన్ కిట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఎఫ్డీసీఏ కమిషనర్ హేమంత్ కోషియా మాట్లాడుతూ అహ్మదాబాద్, సూరత్లోని వివిధ ప్రాంతాల్లో వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, వారందరిపై డ్రగ్ అండ్ కాస్మటిక్స్ చట్టం కింద అందరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గుజరాత్కు చెందిన వ్యక్తిపై ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేశామన్నారు. మెడికల్ అబార్షన్ యాక్ట్ ప్రకారం.. గైనకాలజిస్ట్ సిఫారసు మేరకు మాత్రమే అబార్షన్ కిట్లు అమ్మవచ్చని చెప్పారు.
నిందితుల్లో ఒకరైన అహ్మదాబాద్ నివాసి అయిన పింటూషా.. వినోద్ మహేశ్వరి నుంచి అబార్షన్ కిట్లను అక్రమంగా కొనుగోలు చేసి మరో నిందితుడు లోకేశ్ మహేశ్వరి బానాస్కాంతలోని డీసాలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో విక్రయించేవాడు. పింట షా గత ఒకటిన్నర సంవత్సరాల్లో 800 కిట్లను ఆన్లైన్ విక్రయించాడని పేర్కొన్నారు. డీసా నివాసి మహేశ్వరి సూరత్కు చెందిన జావేరి సంగ్లా నుంచి నకిలీ మెడికల్ స్లిప్ల ఆధారంగా కిట్లు సేకరించే వాడు. ముంబైకి చెందిన మార్కెటింగ్ కంపెనీలో సేల్స్ మేనేజర్ అయిన నిందితుడు రాజేశ్ యాదవ్ నుంచి సంగ్లా ఈ కిట్లు తీసుకునేవాడు. ఎఫ్డీసీఏ ప్రకారం.. మరో నిందితుడు ముంబైలోని మార్కెటింగ్ ప్రతినిధి నీలేవోరాగా గుర్తించారు.
మరోవైపు, ఇతర నిందితులు విపుల్ పటేల్, మోనిష్ పంచల్ నుంచి 700 కిట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు తుషార్ టక్కర్ మూడు లక్షల ఆక్సిటోసిన్ ఇంజెక్షన్, లేబుల్ చేయని ఇతర ఇంజెక్షన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను వడోదరలోని ఎఫ్డీసీఏ ప్రయోగశాలకు పరీక్ష కోసం పంపారు. అల్ప్రాకాన్ 0.5 టాబ్లెట్ (ఆల్ప్రజోలం), ఎడిటాక్స్ ఎన్ -2 టాబ్లెట్, స్పాస్-ట్రాంకన్ టాబ్లెట్ స్వాధీనం చేసుకున్నారు. ఇది లైసెన్స్ లేకుండా కూడా విక్రయిస్తుండగా.. నిందితుడు తుషార్ రాజస్థాన్ అక్రమంగా తరలిస్తూ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.