న్యూఢిల్లీ: తండ్రీ, కుమారుడు రైల్వేలో పని చేస్తున్నారు. అయితే రెండు రైళ్లలో విధుల్లో ఉన్న వారిద్దరూ ఆ రైళ్లు పక్కపక్కన వెళ్తుండగా సెల్ఫీ తీసుకున్నారు. దీంతో ఈ సెల్ఫీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి రైల్వేలో ట్రావెల్ టిక్కెట్ ఎగ్జామినర్ (టీటీఈ)గా పని చేస్తున్నారు. మరోవైపు ఆయన తండ్రి రైల్వేలోనే గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.
కాగా, ఒక రోజు తండ్రీ కుమారులు విధుల్లో ఉండగా ఊహించని సంఘటన జరిగింది. తండ్రి గార్డుగా ఉన్న రైలు, కుమారుడు టీటీఈగా ఉన్న మరో రైలు పక్కపక్కనే వెళ్తూ ఒక చోట ఆగి ఉన్నాయి. దీంతో ఒక రైల్లో టీటీఈ విధుల్లో ఉన్న ఆ కుమారుడు తన మొబైల్ ఫోన్లో మరో రైలులో గార్డు విధుల్లో ఉన్న తండ్రితో సెల్ఫీ తీసుకున్నాడు. సురేశ్ కుమార్ అనే వ్యక్తి ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘అద్భుతమైన సెల్ఫీ’ అని దానికి శీర్షిక పెట్టాడు. అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది, తండ్రీ, కుమారుల పేర్లను ఆయన పేర్కొనలేదు.
మరోవైపు, తండ్రీ కుమారుల సెల్ఫీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ అద్భుత సెల్ఫీపై నెటిజన్లు కూడా అద్భుతంగా స్పందించారు. టైమింగ్ అంటే ఇదేనని ఒకరు, బెస్ట్ సెల్ఫీ, ఈ యుగపు సెల్ఫీ, ప్రౌడ్ మూమెంట్, వావ్, వండర్ఫుల్… అంటూ మరికొందరు కామెంట్ చేశారు.
अजब ग़ज़ब सेल्फ़ी
पिता रेलवे में गार्ड है और बेटा टीटी है । जब दोनो की ट्रेन अगल-बग़ल से गुजरी तो एक सेल्फ़ी का लम्हा बन गया ❤️ pic.twitter.com/Zd2lGHn7z3
— Suresh Kumar (@Suresh__dhaka29) June 15, 2022